ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని ‘ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ’ (APNRTS) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవాసాంధ్రులతో సంబంధాలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ రవికుమార్ పి. వేమూరు ఈ నియామకపు ఉత్తర్వులు (ప్రొసీడింగ్ నంబర్: 06/APNRTS/President/2026, తేదీ: 05.08.2026) విడుదల చేశారు.
నూతన కోఆర్డినేటర్ నియామకం..
ఈ ఉత్తర్వుల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు మండలం కర్తేనిపాడు గ్రామానికి చెందిన శ్రీ రాపర్ల మురళీకృష్ణను ఏపీఎన్ఆర్టీఎస్ అంతర్జాతీయ టూర్ కోఆర్డినేటర్గా నియమించారు. ఇకపై ఆయన విదేశీ పర్యటనలు, ప్రవాసాంధ్రుల సమావేశాలు, అంతర్జాతీయ ప్రతినిధుల నెట్వర్కింగ్ ఈవెంట్లను సమన్వయం చేయనున్నారు.
కీలక బాధ్యతలు..
విదేశాల్లో డయాస్పోరా సమావేశాలు, వేదికలు, లాజిస్టిక్స్, ప్రోటోకాల్ ఏర్పాట్లను ప్లాన్ చేయడం.
స్థానిక విదేశీ ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకోవడం.
అంతర్జాతీయ సమావేశాల ఎజెండాలు సిద్ధం చేయడం, ప్రతినిధులు, ప్రవాసాంధ్రుల మధ్య చర్చలు సులభతరం చేయడం.
విదేశీ భారతీయ సంఘాలు, కమ్యూనిటీ నాయకులను ఏకీకృతం చేయడం, పర్యటనల అనంతరం ఫాలో-అప్లు నిర్వహించడం.
లక్ష్యాలు ..
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇన్ఫోసైట్ బిల్డింగ్లో ఉన్న ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన కార్యాలయం నుండి ఈ అధికారిక సమ్మతిని తెలియజేశారు. ప్రవాసాంధ్రుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో విదేశీ తెలుగు వారి భాగస్వామ్యాన్ని పెంచడంలో ఈ నియామకం ఎంతగానో తోడ్పడుతుందని డాక్టర్ రవికుమార్ పి. వేమూరు పేర్కొన్నారు.
