అమెరికా రాజకీయ వర్గాలను ఒక సంచలన వార్త కుదిపేస్తోంది. అమెరికా ప్రభుత్వ అత్యున్నత రహస్యాలను సేకరించేందుకు చైనా పన్నిన వ్యూహాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏకంగా అమెరికా కాంగ్రెస్లోని కీలక ఇంటెలిజెన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న మాజీ లా మేకర్ ఎరిక్ స్వావెల్ను చైనాకు చెందిన ఓ మహిళ హనీట్రాప్లోకి లాగినట్లు ఎఫ్బీఐ (FBI) దర్యాప్తులో బయటపడింది. దీనికి సంబంధించిన రహస్య పత్రాలను ట్రంప్ యంత్రాంగం తాజాగా బహిర్గతం చేసింది.
పూర్తి వివరాలు ..
అమెరికా చట్టసభకు ఎన్నిక కావడానికి ముందే, అంటే 2013 నాటికి ఎరిక్ స్వావెల్ను క్రిస్టియన్ ఫాంగ్ అనే చైనా మహిళ సంప్రదించినట్లు ఎఫ్బీఐ గుర్తించింది. ఆ ఎన్నికల సమయంలో ఎరిక్కు రాజకీయంగా నిధులు సేకరించడంలోనూ, ప్రచార కార్యక్రమాలను నిర్వహించడంలోనూ ఆ చైనా మహిళ క్రియాశీలక పాత్ర పోషించింది. దర్యాప్తు పత్రాల ప్రకారం 2012 నుంచి 2015 మధ్య కాలంలో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా అత్యున్నత విధాన నిర్ణయాలు జరిగే సభలో కీలకమైన వ్యక్తిని చైనా సుందరి ఈ విధంగా తన వలలోకి లాగడం అప్పట్లో అమెరికా నిఘా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారిక దర్యాప్తు నివేదికల్లో వెల్లడయ్యాయి.
