మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రవితేజ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఈ సినిమా తనకెంత ప్రత్యేకమైనదో అభిమానులతో పంచుకున్నారు.
“ప్రతి సినిమా ఒక కొత్త ప్రయాణాన్ని పరిచయం చేస్తుంది. అయితే ‘ఇరుముడి’ ప్రయాణం నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమాను థియేటర్లలో మీరందరూ చూస్తారన్న విషయం నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. స్వామియే శరణం అయ్యప్ప” అని రవితేజ తన పోస్ట్లో పేర్కొన్నారు. సినిమా టైటిల్కు తగ్గట్టుగా అయ్యప్ప స్వామి నేపథ్యంతో ఈ కథ సాగనుండటం విశేషం.
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి ఫీల్-గుడ్ ఎమోషనల్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ, మాస్ ఇమేజ్ ఉన్న రవితేజతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది ఒక భావోద్వేగభరితమైన ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా వస్తోందని చిత్రబృందం తెలిపింది. ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర ఒక కీలక పాత్రలో కనిపించనుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేషనల్ అవార్డు విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. రవితేజ కెరీర్లో ఇదొక డిఫరెంట్ ఫిల్మ్గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
